అక్షరటుడే, వెబ్డెస్క్ : SBI | సికింద్రాబాద్లోని ప్యాట్నీ సెంటర్లో గల ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్యూట్తో నాలుగో అంతస్తులో మంటలు చేలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. బ్యాంకులోని కీలక ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులతో పాటు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేశారు.
