AIKMS | కార్పొరేట్​ కంపెనీలకే ప్రధాని మోదీ మద్దతిస్తున్నారు
AIKMS | కార్పొరేట్​ కంపెనీలకే ప్రధాని మోదీ మద్దతిస్తున్నారు

అక్షరటుడే, ఆర్మూర్: AIKMS | దేశంలోని కార్పొరేట్ కంపెనీలకే ప్రధాని మోదీ మద్దతిస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు ఆరోపించారు. పట్టణంలోని ప్రజాపంథా కుమార్​ నారాయణ భవన్​లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi) విధానాలకు నిరసనగా హైదరాబాద్​లోని (Hyderabad) ఇందిరాపార్క్ (Indira Park hyderabad)​ వద్ద 8వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్​ విధాన చట్టం బిల్లు పేరుతో కార్పొరేట్​ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం ఆర్మూర్(Armoor Town)​ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు గంగారాం, రాజన్న, సాయన్న, ఠాకూర్​, అర్వింద్​ తదితరులు పాల్గొన్నారు.