అక్షరటుడే,గాంధారి: Water Problems | సదాశివనగర్ (Sadashivnagar) మండలంలోని యాచారం గ్రామం(Yacharam)లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటికోసం మండుటెండల్లో రోడ్లపై గంటలకొద్దీ నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రమేష్ (Ex Sarpanch Ramesh ) మాట్లాడుతూ.. గ్రామంలోని బోర్లలో నీరు రావడం లేదని, మిషన్ భగీరథ నీరు కూడా అందక ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) స్పందించి గ్రామంలో కొత్త బోరు వేయించి సమస్య తీర్చాలని కోరారు.