Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్​.. పెరగనున్న ఛార్జీలు
Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్​.. పెరగనున్న ఛార్జీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ hyderabad​ మెట్రో metro ప్రయాణికులకు త్వరలో షాక్​ తగలనుంది. కొంతకాలంగా ఛార్జీల పెంచుతామని చెబుతున్న సంస్థ త్వరలో ఆ నిర్ణయాన్ని అమలు చేయనుంది. హైదరాబాద్​ మెట్రో Hyderabad metro charges నష్టాల్లో ఉందని, దాని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్​ అండ్​ టీ l&t ఎప్పటి నుంచో చెబుతోంది.

ఛార్జీల పెంచడానికి అనుమతి ఇవ్వాలని గతంలో బీఆర్​ఎస్ brs​ ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే ఎన్నికలు రావడంతో ఛార్జీల పెంపు నిర్ణయం అమలు కాలేదు. దీంతో నష్టాలు తగ్గించుకోవడానికి ఛార్జీలను పెంచాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ట టికెట్​ రూ.10, గరిష్ట ధర రూ.60 ఉండగా.. గరిష్ట రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏడాదికి అదనంగా రూ.150 కోట్ల ఆదాయం వస్తోందని సంస్థ భావిస్తోంది. కాగా ఛార్జీల పెంపు నిర్ణయం మే రెండో వారంలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.