అక్షరటుడే, వెబ్డెస్క్ : District Judge | పదో తరగతి ఫలితాల్లో SSC Results స్టేట్ ఫస్ట్ ర్యాంకు state first ranker సాధించిన కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ (KOS) విద్యార్థి క్రితిని శనివారం జిల్లా జడ్జి District Judge bharatha lakhmi జీవీఎన్ భరత లక్ష్మి అభినందించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో క్రితి 596 మార్కులు సాధించింది.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయి ర్యాంకు తెచ్చుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థినితో పాటు, కేవోఎస్ యాజమాన్యం, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రణాళిక బద్ధంగా శిక్షణ ఇవ్వడంతో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించగలిగానని చెప్పింది. కేవోఎస్ KOS డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించే విధంగా విద్యా ప్రణాళికలు కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ఉంటాయని వివరించారు.
విద్యార్థి తండ్రి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. కేవోఎస్లో చేర్పించిన నాటి నుంచి స్కూల్ కరికులం ద్వారా ఉపాధ్యాయులు, డైరెక్టర్లు ఇచ్చినటువంటి ప్రణాళికల్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. తన కూతురు చదువుకునేదని చెప్పారు. తాను, తన భార్య డాక్టర్లు అయినప్పటికీ.. ఎక్కువ సమయం కేటాయించకున్నా పాఠశాల విద్యా ప్రణాళికలతో స్టేట్ ర్యాంక్ సాధించిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భాస్కర రావు, తదితరులు పాల్గొన్నారు.