అక్షరటుడే, వెబ్డెస్క్: Shraddha Kapoor | బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ Shraddha Kapoor గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సాహో చిత్రంలో ప్రభాస్ Prabhas సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి Telugu audience కూడా దగ్గరైంది. అయితే ఈ భామ తాజాగా వేవ్స్ సమ్మిట్ 2025లో Waves Summit 2025 పాల్గొంది. ఈ కార్యక్రమం కోసం మహారాష్ట్ర Maharashtra సాంప్రదాయ తీపి వంటకం పురాన్ పోలిని sweet dish Puran Poli తీసుకొచ్చింది. దానిని ఇన్స్టా CEO , మెటా అధిపతి ఆడమ్ మోస్సేరికి అందించింది. దానిని ఆయన టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పడంతో అందరు క్లాప్స్ కొట్టారు. అయితే ఆ సమయంలో శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. మీరు అందమైన ప్రదేశాలలో భోజనం చేస్తుంటారు. కాని పురాన్ పోలి అని పిలువబడే ఈ మహారాష్ట్ర డెజర్ట్ను Maharashtrian dessert ఒక్కసారి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపింది.
Shraddha Kapoor | పోలెలకి ఫిదా..
ఈ పురాన్ పోలిని puran poli మా ఇంట్లో తయారు చేస్తారు. గోధుమ పిండి, బెల్లం మరియు ఇతర పదార్థాలను కలిపి పూర్ణంలా తయారు చేయాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూర్ణంతో నింపి, చపాతీలా వత్తుకోవాలి. ఈ వత్తిన పిండిని వేడి నూనెలో hot oil వేసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పోలెలు చాలా రుచికరమైనవిగా ఉంటాయని శ్రద్ధా పేర్కొంది. మహారాష్ట్రలో Maharastra దీనిని ప్రధాన రుచికరమైన వంటకంగా చెబుతారు. అయితే ఆడమ్ మోస్సేరి Adam Mosseri పురాన్ పోలిని సంతోషంగా స్వీకరించి, తిన్నాడు.. అది బాగుందని చెప్పడంతో జనసమూహం హర్షధ్వానాలతో, చప్పట్లతో ఆడిటోరియం మోత మోగించారు
ఆడమ్ పోలే టేస్ట్ చూసి మైమరచిపోయాయి. భారతదేశం వంటకం Indian cuisine అతను ఫిదా అయ్యేలా చేసింది. దీంతో ఇప్పుడు అంతటా పోలె గురించి చర్చ నడుస్తుంది. పోలెలు Pole అనేది ఒక రకమైన స్వీట్, సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ Telangana and Andhra Pradesh ప్రాంతాలలో ఉగాది పండగ సందర్భంగా తయారు చేస్తారు. ఇవి పూర్ణం బొబ్బట్లు లేదా నేతి బొబ్బట్లు అని కూడా పిలుస్తారు. పూర్ణం బొబ్బట్లు Poornam Bobbat గోధుమ పిండి, బెల్లం మరియు ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. మహారాష్ట్రలో కూడా దీనిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు.