ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిFarmer | పది బోర్లు వేసినా చుక్కనీరు పడలే.. మనస్థాపంతో యువ రైతు ఆత్మహత్మ

    Farmer | పది బోర్లు వేసినా చుక్కనీరు పడలే.. మనస్థాపంతో యువ రైతు ఆత్మహత్మ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Farmer | ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 వరకు బోర్లు వేయించాడు ఓ యువరైతు. ఒక్క బోరులో కూడా చుక్క నీరు పడలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    ఈ ఘటన దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. దోమకొండ ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పంతులు గారి పెంటయ్య(26)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ భూమిలో పంట వేసుకోవడానికి సరిపడా నీళ్లు లేకపోవడంతో వరుసగా 10 వరకు బోర్లు వేశాడు. అయినా నీళ్లు పడలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మనెవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...