అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Case | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. లంచం డిమాండ్ చేసిన ఓ సబ్ ఇన్స్పెక్టర్పై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది.
అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూర్ (Manugur) సబ్ ఇన్స్పెక్టర్ బత్తిని రంజిత్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఇద్దరు సోదరులను అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఎస్సై లంచం డిమాండ్ చేశారు. సదరు కేసులో వారిని అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడానికి ఎస్సై రూ.40 వేలు అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఏసీబీ అధికారులు ఎస్సై రంజిత్పై కేసు నమోదు చేశారు.
ACB Case | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
[…] […]