- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Bodhan MLA | విద్యుత్​ సమస్యల పరిష్కారానికి సబ్​స్టేషన్ల నిర్మాణం​: ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

Bodhan MLA | విద్యుత్​ సమస్యల పరిష్కారానికి సబ్​స్టేషన్ల నిర్మాణం​: ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan MLA | నియోజకవర్గంలో విద్యుత్​ సమస్యలకు చెక్​ పెట్టేందుకు సబ్​స్టేషన్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి (MLA Sudarshan Reddy) తెలిపారు. ఈ మేరకు నవీపేట్​ మండలం (Navipet Mandal) హనుమాన్​ ఫారంలో, సాలూరు మండలం జాడి జమాల్​పూర్​​ గ్రామంలో 33/11 కేవీ సబ్​స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బోధన్​ నియోజకవర్గంలో (Bodhan constituency) ఒక్క సబ్​స్టేషన్​ కూడా మంజూరు చేయలేదన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు విద్యుత్​ అంతరాయంతో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అనంతరం కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి రాగానే విద్యుత్​ సబ్​స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

- Advertisement -

కొత్తగా నిర్మించబోయే సబ్​స్టేషన్లను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించామని తెలిపారు. ఒక్కో సబ్​స్టేషన్​ను రూ. 2.23కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్ (Taher Bin Hamdan)​, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి, బోధన్​ డీఈ ముక్తార్​, నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ వైస్​ఛైర్మన్​ రాంచందర్​, ఎస్​ఈ రాపల్లి రవీందర్​, డీఈ నిజామాబాద్​ ఎం.శ్రీనివాస్​, ఏడీఈ కన్స్​స్ట్రక్షన్స్​ తోట రాజశేఖర్​, ప్రశాంత్​రెడ్డి, నగేష్​కుమార్​, నవీపేట్​ ఏఈ ఆనంద్​, శ్రీనివాస్​, కన్స్​స్ట్రక్షన్​ వినోద్​, ఏఈ సుమిత, కళ్యాణ్​, మాజీ జెడ్పీటీసీలు శ్రీనివాస్​ గౌడ్​, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News