అక్షరటుడే, వెబ్డెస్క్ : MIG-21 Jets | దశాబ్దాలు భారత సైన్యానికి సేవలు అందించిన మిగ్ –21 యుద్ధ విమానాలకు ఎయిర్ ఫోర్స్ వీడ్కోలు పలికింది. ఎన్నో యుద్ధాల్లో భారత్కు విజయాన్ని అందించిన ఈ విమానాలకు శుక్రవారం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ (Air Force Chief AP Singh) ఘనంగా వీడ్కోలు పలికారు.
చంఢీగడ్లోని ఎయిర్ఫోర్స్ కేంద్రంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Minister Rajnath Singh), వాయుసేన సీనియర్, మాజీ అధికారులు హాజరు అయ్యారు. కాగా.. భారత వైమానిక దళంలో MiG-21 ప్రయాణం అద్భుతంగా సాగింది. దాదాపు 900 మిగ్ 21 యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) నిర్వహించింది.
MIG-21 Jets | ఎందుకోసం అంటే..
మిగ్ –21 యుద్ధ విమానాలు పాత తరానికి చెందినవి. ప్రస్తుత పరిస్థితులకు అవి అనుకూలం కావు. దీంతో పాటు మిగ్ –21 విమానాలు తరుచూ కూలిపోయేవి. దీంతో వీటిని ఎగిరే శవపేటికలు అని ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలో వీటిని వాడొద్దని ఐఏఎఫ్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా వాటి సేవలకు వీడ్కోలు పలికింది. కాగా.. మిగ్–21 యుద్ధ విమానాలను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. 1963లో మొదటి సారి భారత్లోకి మిగ్ 21 వచ్చింది. తర్వాత సుఖోయ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే వరకు మిగ్–21 విమానాలు భారత వైమానిక దళంలో అనేక సేవలు అందించాయి. మిగ్–21 యుద్ధ విమానాల(MIG-21 Jets) స్థానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ భర్తీ చేయాలని ఐఏఎఫ్ యోచిస్తోంది.
MIG-21 Jets | ఆ యుద్ధాల్లో కీలక పాత్ర
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన 1965 యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి సమయంలో 1971 జరిగిన యుద్ధంలో మిగ్–21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. పాకిస్తానీ F-86, F-104 స్టార్ఫైటర్లను కూల్చివేశాయి. తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ లొంగిపోవడానికి సహాయపడిన ఢాకాలోని గవర్నర్ ఇంటిపై ప్రసిద్ధ బాంబు దాడితో సహా భూ దాడులను కూడా నిర్వహించాయి. 1999 కార్గిల్ యుద్ధం, 2019 బాలకోట్ వైమానిక దాడుల్లో సైతం ఇవీ సేవలు అందించాయి. మిగ్ 21 యుద్ధ విమానాలను భారత్ మొదట రష్యా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం సాంకేతిక బదిలీ చేయడంతో 600 విమానాలు భారత్లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.