అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Task Force Police | పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. 16 మందిని అరెస్ట్ చేశారు.
సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్ఛార్జి ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీసీఎస్ ఎస్సై గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు చేశారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామంలో పేకాట స్థావరంపై రైడ్ చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు ఫోన్లు, రూ.13,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అదే గ్రామంలోని మరోచోట పేకాట స్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 ఫోన్లు, రూ.11,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని తదుపరి చర్యలు నిమిత్తం వర్ని ఎస్హెచ్వో (Varni SHO)కు అప్పగించారు.