- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిFarmers | బోనస్​ విడుదల చేయాలని రైతుల డిమాండ్​

Farmers | బోనస్​ విడుదల చేయాలని రైతుల డిమాండ్​

- Advertisement -

అక్షరటుడే, బీర్కూర్​: Farmers | యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో (paddy purchase center) విక్రయించిన ధాన్యానికి వెంటనే బోనస్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దామరంచ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ (Mahajana Sabha) నిర్వహించారు.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఋణమాఫీ పొందని రైతు సభ్యులకు ఏకకాలంలో ఋణ మాఫీ వచ్చేలా చూడాలని తీర్మానం చేశారు. బోనస్​ రాకపోవడంతో రైతులు (Farmers) అప్పులు చేసి ఖరీఫ్​ సాగు చేస్తున్నారని వాపోయారు. వెంటనే బోనస్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సభలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News