- Advertisement -
HomeతెలంగాణKTR | చంద్రబాబు చెప్పినట్లు రేవంత్​రెడ్డి ఆడతారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | చంద్రబాబు చెప్పినట్లు రేవంత్​రెడ్డి ఆడతారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల బాస్​ చంద్రబాబు (Chandrababu) చెప్పినట్లు ఆయన ఆడతారన్నారు.

హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ​(Telangana Bhavan) బుధవారం ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ 5 ఫీట్లు ఎత్తు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. అదే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్​కు (Kaleshwaram Project) తాము రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.లక్ష కోట్లు తిన్నారని ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.93 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్ట్​లో రూ.లక్ష కోట్లు ఎలా తింటారని ఆయన ప్రశ్నించారు. బ్యారేజీలు, పంప్ హౌస్లు, సొరంగ మార్గాలు, కాల్వలు, రిజర్వాయర్లు ఎవరు కట్టారన్నారు.

- Advertisement -

KTR | రైతులపై థర్డ్​ డిగ్రీ..

నల్గొండలో యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేటీఆర్(KTR)​ మండిపడ్డారు. కులం పేరుతో తిట్టి, ఇంట్లో నుంచి లాక్కెళ్లి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు నడవలేని స్థితిలో ఉన్నాడన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తామని చెప్పారు. దీని వెనకున్న ఎవరిని వదిలిపెట్టమని కేటీఆర్​ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను కూడా సంప్రదించాలని మాజీ మంత్రి జగదీశ్వర్​రెడ్డికి సూచించామన్నారు.

KTR | యూరియా బస్తా ఉంటే ధనవంతుడు

కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం భూమి ఉంటే ధనవంతుడని మాజీ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. అదే కాంగ్రెస్ పాలనలో ఒక్క యూరియా బస్తా ఉంటే ధనవంతుండనే పరిస్థితికి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి బీఆర్​ఎస్​లో చేరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News