- Advertisement -
Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad Metro | ఆగిపోయిన మెట్రో రైలు

Hyderabad Metro | ఆగిపోయిన మెట్రో రైలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మెట్రో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

నగరంలో మంగళవారం ఉదయం మెట్రో రైలు సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. భరత్‌నగర్‌ (Bharat Nagar) స్టేషన్‌లో 8 నిమిషాలకి పైగా ట్రైన్​ ఆగిపోవడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. అనంతరం సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించారు. దీంతో రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.

- Advertisement -

నగరంలో గతంలో సైతం పలుమార్లు సాంకేతిక కారణాలతో మెట్రో రైలు నిలిచిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్‌లో వెళ్తున్న మెట్రో రైలు భరత్​ నగర్​ స్టేషన్​లో మే నెలలో సైతం ఆగిపోయింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా నగరంలో నిత్యం మెట్రో రైళ్లలో వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. అలాంటి మెట్రో ట్రైన్లు సడెన్​గా ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News