- Advertisement -
Homeతాజావార్తలుBodhan | చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

Bodhan | చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Bodhan | చెరువలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోధన్​ రూరల్​ ఎస్సై మచ్చేందర్(Bodhan Rural SI Machender)​ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ మండలంలోని ఏరాజ్​పల్లి గ్రామానికి(Erajpalli Village) చెందిన యువకుడు సుప్పల సాయిలు కూలీ పనిచేసుకునేవాడు.

రెండురోజులుగా అతడు అదృశ్యం కావడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మంగళవారం ఉదయం గ్రామంలోని చెరువు కట్టపై గంగమ్మ గుడి(Gangamma Temple) వద్ద సాయిలుకు చెందిన ఫోన్​, చెప్పులు, బండి ఉండడంతో గ్రామస్థులు గమనించగా.. చెరువులో మృతదేహం కనిపించింది. కుటుంబ కలహాలతో సాయిలు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News