- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిGandhari mandal | రాష్ట్రస్థాయి కబడ్డీ జట్లకు కెప్టెన్​లుగా పేట్ సంగెం విద్యార్థులు

Gandhari mandal | రాష్ట్రస్థాయి కబడ్డీ జట్లకు కెప్టెన్​లుగా పేట్ సంగెం విద్యార్థులు

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Gandhari mandal | గాంధారి మండలంలోని పేట్ సంగెం ఉన్నత పాఠశాల (Pet Sangem High School) విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్లకు కెప్టెన్​లుగా సారథ్యం వహించనున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్​ క్రీడా మైదానంలో జరిగిన సబ్​ జూనియర్​ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీలో (district-level kabaddi tournament) పేట్​ సంగెం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.

దీంతో రాష్ట్ర స్థాయి బాలికల జట్టుకు బాలికల జట్టుకు భానుతుషా, బాలుర జట్టుకు బుక్య అర్జన్​లను ఎంపిక చేశారు. అలాగే అదే పాఠశాలకు చెందిన అవంతిక కూడా సెప్టెంబర్ 25న నిజామాబాద్ జిల్లా ముప్కాల్​ మండలంలోని ఇండోర్ స్టేడియంలో (indoor stadium) జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల ఎంపికపై భామన్ స్పోర్ట్స్ ఫౌండేషన్ బాధ్యులు సురేందర్, అధ్యక్షుడు సేవాంతరాథోడ్, గ్రామస్థులు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News