అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అడ్వకేట్ దయాకర్ గౌడ్ (Advocate Dayakar Goud) బాధ్యతలు స్వీకరించారు. పీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు (district court) ఆవరణలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రతినిధులు, అడ్వకేట్లు పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Taher Bin Hamdan), గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పట్టణ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ లీగల్ సెల్ ఛైర్మన్ బైరా గణేష్, నరేందర్, శ్యాంబాబు, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు బొట్టు వెంకటేష్ తదితరులు ఉన్నారు.