- Advertisement -
Homeతాజావార్తలుNizamabad City | రోడ్డు ప్రమాదంలో ఆర్​ఎంపీ మృతి

Nizamabad City | రోడ్డు ప్రమాదంలో ఆర్​ఎంపీ మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్​ఎంపీ మృతి చెందాడు. ఈ ఘటన కంజర గ్రామం (Kanjara Village) వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మోపాల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్​ మండలం (Mopal Mandal) నర్సింగ్​పల్లి గ్రామానికి చెందిన వెల్దుర్కి గంగాధర్​(53) ఆర్​ఎంపీగా పనిచేస్తున్నాడు.

అయితే శనివారం అర్ధరాత్రి తర్వాత కంజర గ్రామం సమీపంలోని రెసిడెన్షియల్​ స్కూల్​ వద్ద చెట్ల మధ్య పొదల్లో ఓ వ్యక్తి పడి ఉన్నాడని స్కూల్​ వాచ్​మన్​ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని వెల్దుర్కి గంగాధర్​గా గుర్తించారు.

- Advertisement -

కానీ అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతుడి​ కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెంది ఉంటాడా.. లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News