- Advertisement -
Homeతాజావార్తలుMinister Anitha | ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. జగన్ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు :...

Minister Anitha | ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. జగన్ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు : హోం మంత్రి అనిత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Anitha | తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇటీవల వైసీపీ అధినేత జగన్ (YS Jagan)​ చేసిన వ్యాఖ్యలకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కౌంటర్​ ఇచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

అధికారం కోల్పోయిన నాటి నుంచి వైఎస్​ జగన్​ అసెంబ్లీ (Assembly)కి వెళ్లడం లేదు. ఆయనతో పాటు వైసీపీ నుంచి గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు సైతం శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీనిపై ఇటీవల వైఎస్​ జగన్​ స్పందిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామన్నారు. జగన్​ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Minister Anitha | ఎమ్మెల్యేగా రావాలి

జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అనిత ఎద్దేవా చేశారు. హోదా ఇచ్చేందుకు కావాల్సిన సీట్లు రాకపోవడంతోనే స్పీకర్​ ఇవ్వడం లేదన్నారు. దీనిపై వైఎస్​ జగన్​ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారని ఆమె ఆగ్రం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే (Pulivendula MLA)గా అసెంబ్లీకి రావాలని ఆయనకు సూచించారు. వైసీపీ హయాంలో చంద్రబాబుకు అవమానం జరిగితే, ఆయన ఒక్కరే వాకౌట్‌ చేశారనిచ గుర్తు చేశారు. కానీ జగన్​ మాత్రం తన ఎమ్మెల్యేలను ఎవరిని సభకు రానివ్వడం లేదన్నారు.

Minister Anitha | లిక్కర్​స్కామ్​ విచారణ సాగుతోంది

ప్రజా సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ వేదిక అని అనిత అన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు అసెంబ్లీలో మాట్లాడాలని ఉంటుందని చెప్పారు. అయితే జగన్​ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వెళ్లే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. జగన్ రాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలను అయినా అస్లెంబీకి పంపాలని మంత్రి సూచించారు. లిక్కర్​ స్కామ్ (Liquor scam)​పై ఆమె స్పందిస్తూ విచారణ కొనసాగుతోందన్నారు. నివేదిక వచ్చాక దానిపై స్పందిస్తానని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News