అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief | జిల్లాకు విచ్చేసిన పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్(PCC chief Bomma Mahesh Kumar Goud)ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
పీసీసీ చీఫ్గా నియమితులై ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా.. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో (R&B Guest House) ఆయనను గజమాలతో సన్మానించారు. కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కాంగ్రెస్ నాయకులు నగేష్ గౌడ్, రత్నాకర్, నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.