అక్షరటుడే, ఇందూరు : RTC Buses | దసరా పండుగ (Dussehra Festival) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ప్రధానంగా నిజామాబాద్ రీజియన్ (Nizamabad Region) నుంచి సికింద్రాబాద్, అలాగే తిరుగు ప్రయాణానికి అదనపు బస్సులు వేశామన్నారు.
RTC Buses | 26వ తేదీ నుంచి..
ఈనెల 26న 50, 27న 80 బస్సులు, 28న 68 బస్సులు, 29 నుంచి ఒకటో తేదీ వరకు 50 చొప్పున బస్సులను సికింద్రాబాద్కు, అలాగే ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు (Special Buses) నడుస్తాయన్నారు. రీజియన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జేబీఎస్ బస్టాండ్లో డిపోల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతమైన, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. టికెట్ బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.