అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs OMAN | ఆసియా కప్ (Asia Cup 2025) క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు శుక్రవారం (సెప్టెంబరు 19) తన చివరి గ్రూప్ మ్యాచ్ ఒమన్తో ఆడింది.
ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఒమన్ చివరి వరకు పోరాడి ఓడింది. ఒమన్ ఆటగాళ్లలో అమీర్ ఖలీమ్ 64 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత ఆటగాళ్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేశారు. పవర్ ప్లేలో భారత ఆటగాళ్లు బాగానే ఆడారు.
ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 10 రన్ రేట్తో రెచ్చిపోయారు. బ్యాటర్ సంజు శాంసన్ (56 పరుగులు) హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా కేవలం ఒకటే పరుగు చేసి రన్ ఔట్ అయ్యాడు.
ఒమన్ Oman ఆటగాళ్లు మధ్యలో బాగానే ఆడినా.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయారు. ముఖ్యంగా చివరి ఓవర్లో పరిస్థితి తలెత్తింది.
దీంతో ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో భారత్ 21 పరుగులతో ఘన విజయం సాధించింది.
IND vs OMAN : ఇప్పటికే సూపర్ ఫోర్కు అర్హత..
ఇక భారత ఆటగాళ్లు ఇప్పటికే వరుసగా రెండు విజయాలు అందుకుని సూపర్ ఫోర్కు అర్హత పొందారు. ఈరోజు కూడా గెలిచి, నంబర్ 1 స్థానంలో ఉన్న గ్రూప్ దశను ముగించారు. ఇక వరుసగా రెండు ఓటములతో ఒమన్ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించింది.
కాగా, భారత్ మరో గెలుపు అందుకుని, ఆసియా కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన శ్రీలంక రికార్డును సమం చేసింది.