అక్షరటుడే, ఇందూరు: Gazetted Headmasters Association | పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్లను అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో అశోక్కు (DEO Ashok) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, రఘునందనాచారి మాట్లాడుతూ 2025 మే, జూన్ మాసంలో పనిచేసిన జీహెచ్ఎంలకు ఈఎల్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభైనప్పటి నుంచి వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు వేతనాలు రాలేదన్నారు.
2024లో నియామకమైన ఉపాధ్యాయులకు అక్టోబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వేతనాలకు సంబంధించిన బిల్లులు చేసేందుకు మ్యాచింగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.