Nizamabad
Nizamabad | నీట్​ ర్యాంకర్​కు సన్మానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నీట్ పీజీ పరీక్షలో (NEET PG Exam) రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 558వ ర్యాంకు సాధించిన డాక్టర్​ దీక్షితను నిజామాబాద్ మెడికల్ కాలేజీలో (Medical College) శుక్రవారం సన్మానించారు.

ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపాల్స్ నాగమోహన్, జలగం తిరుపతి రావు, కిషోర్‌కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. దీక్షిత తమ కాలేజీకి గర్వకారణమన్నారు. ఆమె విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత, స్వీయ కృషి కారణమని చెప్పారు. ప్రణాళికాబద్ధమైన చదువు, క్రమశిక్షణతో నీట్ పీజీ పరీక్షలో విజయం సాధించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.