MLA Dhanpal
MLA Dhanpal | దేశంలో తయారయ్యే వస్తువులనే వినియోగించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | దేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే మనం వినియోగించాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. ఇందూర్​​ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత స్వదేశీ వినియోగదారుల చైతన్యం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోదీ పిలుపు మేరకు స్వదేశీ వస్తు వినియోగం ఆవశ్యకతకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో పెట్టుబడిదారులు ఎవరున్నా సరే.. ఆయా వస్తువుల తయారీ వనకే మనమే ఉండాలన్నారు. అలాగే మేడ్​ ఇన్​ ఇండియా లక్ష్యాలను సఫలీకృతం చేయాలని ఆయన వివరించారు. అనారోగ్యాలకు కారణమవుతున్న కూల్​డ్రింక్స్​ (cold drinks), పిజ్జా, బర్గర్​లాంటి జంక్​ ఫుడ్స్​ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇందూర్​ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పెందోట అనిల్​కుమార్​, సందు ప్రవీణ్​ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ‘భారత్ స్వదేశీ వినియోగదారుల ఉద్యమం 2.0″ (Bharat Swadeshi Consumer Movement 2.0) అనే కార్యక్రమం సెప్టెంబర్​ 7వ తేదీన ప్రారంభమైందన్నారు.

ఈ క్రమంలో జిల్లాలో మొదటి ఫేజ్ ‘ఈట్ రైట్ ఫుడ్’ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాట్ కో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాయావర్ రాజేశ్వర్, దక్షిణాది రాష్టాల వినియోగదారుల సమన్వయ సమితి ఉపాధ్యక్షుడు తంగనపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వీఎన్​ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, దేవేష్, సదానందం తదితరులు పాల్గొన్నారు.