అక్షరటుడే, వెబ్డెస్క్: Ather Experience Centers | భారత్కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
దేశవ్యాప్తంగా 500కి పైగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (EC) ప్రారంభించి ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ముఖ్యంగా రిజ్తా (Rizta)-ఏథర్ మొదటి ఫ్యామిలీ స్కూటర్ కోసం, ఏథర్ దేశవ్యాప్తంగా తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.
ఈ మైలురాయి గురించి అథర్ ఎనర్జీ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ Mr. రవ్నీత్ సింగ్ ఫోకేలా మాట్లాడారు.
“500 ఎక్స్పీరియన్స్ సెంటర్లను దాటడం మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు. డిమాండ్కు అనుగుణంగా మేము మా ఉనికిని విస్తరిస్తూనే ఉంటాం. దక్షిణ భారత్ మాకు బలమైన స్థావరం. ఇక్కడ మేము నిరంతరం వృద్ధి చెందుతున్నాం. మేము టైర్ 2, 3 నగరాల్లో కూడా లోతుగా విస్తరిస్తున్నాం. FY26 చివరి నాటికి ఎక్స్పీరియన్స్ సెంటర్ల సంఖ్యను 700కు పెంచుతాం. భారత్ అంతటా ఎక్కువ మంది వినియోగదారులకు ఏథర్ను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం..” అని వివరించారు.
Ather Experience Centers | మూడు నెలల్లో 101 సెంటర్లు..
గత మూడు నెలల్లో (జూన్-ఆగస్టు 2025), ఏథర్ భారత్ అంతటా తన నెట్వర్క్లో 101 కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
వీటిలో, 58కి పైగా ఆగ్రా (ఉత్తర ప్రదేశ్), మండ్సౌర్, జబల్పూర్ (మధ్యప్రదేశ్), సుందర్గఢ్ (ఒడిషా), వడోదర (గుజరాత్), బిలాస్పూర్ (ఛత్తీస్గఢ్) వంటి నగరాల్లో తెరిచారు.
ఏథర్ మార్కెట్ లీడర్గా ఉన్న దక్షిణ భారత్ కూడా, సంస్థ ఒక బలమైన రిటైల్ నెట్వర్క్ను నిర్మించి నిరంతరం విస్తరిస్తోంది.
అదనంగా క్యాలికట్, ఇండోర్, నాసిక్, కోయంబత్తూర్, గుంటూరు, హల్ద్వానీ, సతారా, కోట, కాంగ్రా, ఐజ్వాల్ వంటి టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా ఏథర్ తన ఉనికిని మరింత లోతుగా విస్తరిస్తోంది. ఏథర్ గోల్డ్ సర్వీస్ సెంటర్లతో సహా తన సర్వీస్ నెట్వర్క్ను కూడా విస్తరిస్తూ పోతోంది.
Ather Experience Centers | హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయంటే..
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఏథర్ రిటైల్ నెట్వర్క్ ఒక్కో రాష్ట్రంలో 50కి పైగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
బెంగళూరులో 18 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో అగ్రస్థానంలో ఉంది. పుణె, హైదరాబాద్లో 13, ఢిల్లీలో 9, ముంబయి, చెన్నైలో 8 ఉన్నాయి.
మార్కెట్ వాటా..
వినియోగదారుల డిమాండ్, పెరుగుతున్న మార్కెట్ వాటా ఈ రిటైల్ విస్తరణకు అండగా నిలుస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఏథర్ జాతీయ మార్కెట్ వాటా Q1 FY25లో 7.6% నుంచి Q1 FY26లో 14.3%కి పెరిగింది. దక్షిణ భారతదేశంలో 22.8% మార్కెట్ వాటాతో ఏథర్ ముందంజలో ఉంది.
తయారీ ప్లాంట్లు..
ప్రస్తుతం ఏథర్కు తమిళనాడులోని హోసూర్లో రెండు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి వాహన అసెంబ్లీ కోసం, మరొకటి బ్యాటరీ తయారీ కోసం.
మహారాష్ట్రలోని బిడ్కిన్, ఔరిక్, ఛత్రపతి శంభాజీ నగర్లో మూడో తయారీ ప్లాంట్ రాబోతుంది. మహారాష్ట్రలో రాబోయే ప్లాంట్ ఏథర్ మొత్తం తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 1.42 మిలియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు పెంచుతుందని భావిస్తున్నారు.