అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బైక్ను డీసీఎం ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన నస్రుల్లాబాద్లోని (Nasrullabad) నిజాంసాగర్ కాలువ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన సాకలి సాయిలు, కుమ్మరి విఠల్ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం ఎరువులు తెచ్చుకునేందుకు బోధన్ (Bodhan) వైపు బైక్పై బయలుదేరారు.
ఈ క్రమంలో నస్రుల్లాబాద్ మండలం నిజాంసాగర్ కాలువ (Nizamsagar canal) వద్ద బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించారు. కుమ్మరి విఠల్ స్వల్పగాయాలతో బయటపడగా.. సాకలి సాయిలు కుడిచేయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో క్షతగాత్రుడిని అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ శ్రీకాంత్ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.