More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్​శాఖకు రావాల్సిన పెండింగ్​ బిల్లులను వెంటనే మంజూరయ్యేలా చూడాలని జిల్లా పోలీస్​ శాఖ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు కోరారు.

    ప్రజాపాలన దినోత్సవం (Prajapalana Dinotsavam) సందర్భంగా జిల్లాకు ముఖ్య​అతిథిగా విచ్చేసిన సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డికి (Vem Narender Reddy) ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఆధ్వర్యంలో అసోసియేషన్​ తరపున వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు షకీల్​ పాషా మాట్లాడుతూ.. ఎస్​ఎల్​ఎస్​, అడిషనల్​ ఎస్​ఎల్​ఎస్​లు, జీపీఎఫ్​లు, 2018 పీఆర్సీ బకాయిలు, 2023 టీఏలు పెండింగ్​లో ఉన్నాయని.. వాటిని విడుదల చేయాలని కోరారు. 2018 పీఆర్సీ బకాయిలు మాత్రం రాష్ట్రంలో ప్రతి శాఖకు అందజేశారని పోలీస్​శాఖకు మాత్రం రాలేదన్నారు.

    ఈ ఏడాదిలో విద్యాసంవత్సరం ప్రారంభమై చాలా రోజులైనా ఫీజులు కట్టడంలో పోలీసు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగువారికి పెద్ద పండుగైన దసరా ముందైనా పెండింగ్​ బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు.

    More like this

    Cyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట బెదిరింపులు.. హార్ట్​ ఎటాక్​తో రిటైర్డ్​ డాక్టర్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్ల బెదిరింపులకు ఓ మహిళ బలైపోయింది. డబ్బుల కోసం...

    CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సాయమందించిన సీపీ..

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడి ఓ వ్యక్తి గాయపడగా.. అటువైపుగా వెళ్తున్న...

    Bheemgal Mandal |ఘనంగా విశ్వకర్మ యజ్ఞం

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | భీమ్‌గల్‌ శివారులోని మోతె రోడ్ లో గల విశ్వకర్మగుట్టపై (Vishwakarma gutta)...