More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

    Yellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | కాజ్​వేపై వరదను అంచనా వేయకుండా దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నిజాంసాగర్​ ఎస్సై శివకుమార్​ (Nizamsagar SI Sivakumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్​ అచ్చంపేటలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగమడుగు కాజ్​వేను (Nagamadugu causeway) దాటేందుకు ప్రయత్నించాడు.

    వరద ఉధృతంగా ఉండగా గమనించకుండా ఆయన కాజ్​వేను దాటేందుకు ప్రయత్నించి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ప్రవీణ్​కు భార్య సునీత, పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గల్లంతైన చాకలి ప్రవీణ్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్​ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

    More like this

    Maoists Letter | మావోయిస్టుల సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maoists Letter : సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సగర్వంగా ఎగిరిన ఎర్రజెండా ఇప్పుడు దారం తెగిన...

    Rape Murder | దారుణం.. ఒకేరోజు ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం

    అక్షరటుడే, హైదరాబాద్: Rape Murder | హైదరాబాద్‌ Hyderabad లో ఒకేరోజు ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం కావడం...

    Temporary transfers allowed | జీఓ 317, జీఓ 46పై అభ్యంతరాలకు పరిష్కారం.. తాత్కాలిక బదిలీలకు అనుమతి!

    అక్షరటుడే, హైదరాబాద్: Temporary transfers allowed | తెలంగాణ Telangana ప్రభుత్వ ఉద్యోగుల government employees కు సంబంధించి...