అక్షరటుడే, హైదరాబాద్: KTR meets medical students | తెలంగాణలో కొత్త స్ధానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్ విద్యార్థులతో సోమవారం (సెప్టెంబరు 15) కేటీఆర్ భేటీ అయ్యారు.
మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష medical entrance exams లో ఈ విద్యార్థులు అర్హత సాధించారు. నీట్ NEETలో ప్రతిభ కనబర్చి, మంచి ర్యాంకు సాధించారు.
అయినప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government తీసుకొచ్చిన కొత్త స్ధానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
KTR meets medical students | సీఎస్తో మాట్లాడి..
దీనిపై స్పందించిన కేటీఆర్ KTR విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆలకించారు.
విద్యార్థుల సమస్యలు విన్న కేటీఆర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యపై సానుకూలంగా పరిశీలించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.