More
    Homeజిల్లాలునిజామాబాద్​Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

    Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Urea Shortage | యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) మాట్లాడితే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు మనాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), సునీల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగధర్ అన్నారు. వేల్పూర్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.

    యూరియా కొరత (urea shortage) లేకుంటే రైతులందరూ ఒక్క సంచి కోసం రోడ్లమీద ఎందుకు నిలబడుతున్నారని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ యూరియా సరఫరా చేసినట్లు సునీల్​రెడ్డి అంటున్నారని, రైతులు ఎందుకు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత ఇలాగే ఇంకో వారం రోజులు ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రశ్నించిన వారిని బెదిరించడం సరికాదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...