More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి

    Bodhan | వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Bodhan | భారీవర్షాలతో (Heavy Rains) శ్రీరాంసాగర్ బ్యాక్​వాటర్​లో ఇళ్లు, పొలాలు నీట మునిగి నష్టపోయిన వరద బాధితులకు పరిహారం చెల్లించాలని బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో (Collectorate) సోమవారం వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా సోయా, వరి, పత్తి పంటలు 90 శాతం నష్టపోయాయన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి నిత్యావసర సరుకులు పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారన్నారు. పంట మునిగిపోయి రైతులు (Farmers) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నారు. ఎటువంటి పరిమితులు లేకుండా బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు.

     Bodhan | బోధన్​ నియోజకవర్గంలో..

    ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బోధన్​ నియోజకవర్గ ప్రజలు అత్యధికంగా నష్టపోయారు. ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్ ​(SRSP Back Water) కారణంగా హంగర్గా తదితర గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది.

    More like this

    Pension Schemes | పెంచిన పింఛన్లు ఇవ్వకుంటే సీఎంను అడుగడుగునా అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pension Schemes | పెంచిన పింఛన్లు(Pensions) ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని...

    Hero Upendra | హ్య‌క‌ర్ల వ‌ల‌లో ప‌డ్డ క‌న్న‌డ స్టార్ హీరో ఫ్యామిలీ.. ఉపేంద్ర‌తో పాటు ఆయ‌న భార్య ఫోన్ హ్యాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hero Upendra | ప్రముఖ కన్నడ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర మరియు ఆయన...

    Stock Markets | ఎనిమిది సెషన్ల లాభాలకు బ్రేక్‌.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Stock Markets | గత ఎనిమిది సెషన్లు(8 Sessions)గా లాభాల బాటలో పయనిస్తున్న నిఫ్టీకి...