అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం (Headmasters’ Association) జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర టీజీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా చొప్పదండి శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్, రావుట్ల), ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రఘునందనాచారి (జెడ్పీహెచ్ఎస్, ధర్మోరా), జిల్లా కార్యవర్గ సభ్యులుగా కృష్ణాచారి (జెడ్పీహెచ్ఎస్, ఏర్గట్ల), సంధ్యారాణి (జెడ్పీహెచ్ఎస్, వాల్గోట్ కలాన్), సంతోష్కుమార్ (జెడ్పీహెచ్ఎస్, సుంకేటి), ప్రభాకర్ (జెడ్పీహెచ్ఎస్, మోర్తాడ్), వెంకటయ్య (జెడ్పీహెచ్ఎస్, పాలెం) ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రాజభాను చంద్రప్రకాశ్ (Rajabhanu Chandraprakash) మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లు కల్పించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ తదితర పోస్టులను ప్రధానోపాధ్యాయులకు కల్పించాలని కోరారు. వేసవి సెలవుల్లో ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవుల్లో బదిలీలు (Transfers) నిర్వహించాలని కోరారు.