అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్(Hyderabad) నగరంలోని సికింద్రాబాద్ పరిధిలో గల ఓల్డ్ బోయిన్పల్లి మేధా పాఠశాల లైసెన్స్ను రద్దు చేస్తూ విద్యాశాఖ(Education Department) కీలక నిర్ణయం తీసుకుంది.
పాఠశాలలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం ఈగల్ టీమ్(Eagle Team) పాఠశాలపై దాడులు చేపట్టింది. కల్తీ కల్లు తయారీలో వినియోగించే అల్ప్రాజోలం పాఠశాలలో తయారు చేస్తున్నట్లు గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంతో తాజాగా విద్యాశాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేధా స్కూల్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad | స్కూల్ సీజ్
మేధా స్కూల్(Medha School)లో పది కిలోల మత్తు మందు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ తయారుచేసి అమ్మినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటికే పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. తాజాగా లైసెన్స్ రద్దు చేయడంతో బడిలోని విద్యార్థులను మరో స్కూల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు కల్గకుండా.. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈగల్ టీమ్ చర్యలు చేపట్టింది.
Hyderabad | 8 రియాక్టర్లు..
మేధా పాఠశాలలలో డైరెక్టర్ జయప్రకాశ్ గౌడ్ డ్రగ్స్ తయారీ కోసం 8 రియాక్టర్లు(8 Reactors) ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ తరహాలో రియాక్టర్లు పెట్టాడు. అదే భవనంలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పాఠశాల కొనసాగుతోంది. జీ+2 భవనంలో 6 గదుల్లో స్కూల్.. ఒక వైపు తరగతి గదులు, మరో వైపు డ్రగ్స్ తయారీ నిర్వహిస్తున్నారు. స్కూల్ సెలవు రోజుల్లో జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్నట్లు ఈగల్ టీమ్ పోలీసులు గుర్తించారు.