అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు కుంగిపోయాయి. దీంతో ఓ లారీ(Lorry) వంతెన వద్ద ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారిపై అడవి లింగాల గేట్(Lingala Gate) వద్ద ఆదివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఓలారీ కామారెడ్డి–ఎల్లారెడ్డి(Kamareddy-Yellareddy) రహదారిపై వంతెన వద్ద రోడ్డుపక్కన ఇరుక్కుపోయింది. లారీబ్రిడ్జి పక్కకు కూరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడలేదు.కాగా ఇటీవల కురిసిన భారీవర్షానికి పోటెత్తిన వరద కారణంగా ఈ బ్రిడ్జి తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలను కొనసాగిస్తున్నారు. వర్షాల కారణంగా వచ్చే వరద తాకిడిని తట్టుకొనేలా నాణ్యతతో కూడిన శాశ్వత వంతెన పనులను చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.