More
    HomeతెలంగాణKTR | దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్​కు కేటీఆర్​...

    KTR | దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్​కు కేటీఆర్​ సవాల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విరుచుకుపడ్డారు. గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన గద్వాల గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

    రేవంత్​రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్​ సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఎందో చూద్దామన్నారు. పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేక పోతున్నారన్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్​ దగ్గర ఓ మాట, ప్రజల దగ్గర మరోమాట చెబుతున్నారని విమర్శించారు.

    KTR | ఉప ఎన్నికలు వస్తాయి

    కాంగ్రెస్​లోకి పోయిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి (Krishnamohan Reddy) సిగ్గు లేకుండా బీఆర్​ఎస్​లో ఉన్నానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ మీటింగ్​ గద్వాలలో అయితే ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి దగ్గర కూర్చొని బీఆర్​ఎస్​లో ఉన్నానని చెబుతున్నారన్నారు. ఎవరు ఎన్ని చేసిన పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదని కేటీఆర్​ అన్నారు. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపుల విషయంలో సుప్రీం కోర్టు సీరియస్​గా ఉందన్నారు. ఆరు నుంచి 9 నెలల్లో ఉప ఎన్నిక వస్తుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుదామన్నారు.

    KTR | ఎవరి అభివృద్ధి కోసం..

    అవసరం అయితే రైలు కింద తలపెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్​లో చేరనని ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి గతంలో చెప్పారన్నారు. కానీ నేడు అభివృద్ధి కోసం పార్టీలోకి వెళ్లినట్లు చెబుతున్నారని విమర్శించారు. ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక గద్వాల​లో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన నిలదీశారు. గద్వాల ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్ (BRS)​ 50 వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు.

    KTR | బీఆర్​ఎస్​ హయాంలోనే గద్వాల అభివృద్ధి

    తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కేసీఆర్​ (KCR) అభివృద్ధి చేశారని కేటీఆర్​ అన్నారు. మారుమూల ప్రాంతంగా ఉన్న గద్వాల్​ను ​ జిల్లా కేంద్రం చేశారన్నారు. మెడికల్, నర్సింగ్​ కాలేజీలను బీఆర్​ఎస్​ హయాంలో ఏర్పాటు చేశామన్నారు. తమ హయాంలో గద్వాలలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు రంగులు మార్చి కాంగ్రెస్​ మంత్రులు ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.

    KTR | హామీల పేరుతో కాంగ్రెస్​ మోసం

    కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి రేవంత్​రెడ్డి అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సీఎం ​రెడ్డి అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

    KTR | గులాబీ జెండా ఎగరాలి

    స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయాలని కేటీఆర్​ కోరారు. గద్వాల మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్​ నాయకులు యూరియాను బ్లాక్​ మార్కెట్​కు తరలించి అమ్ముకుంటున్నారని కేటీఆర్​ ఆరోపించారు. గ్రూప్​–1 (Group-1) ఉద్యోగాలను సైతం అమ్ముకున్నారన్నారు. ఈ సందర్భంగా గద్వాల మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేశవ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కేటీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...