అక్షరటుడే, బాన్సువాడ : Banswada | బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్(MP Suresh Kumar Shatkar)ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, రైతు సమస్యలు, పలు స్థానిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కార కోసం కృషి చేయాలని నాయకులు కోరారు. ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, అంబర్ సింగ్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.