అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో హైటెక్ వ్యభిచారం (High-tech prostitution) నిర్వహిస్తారు. బ్యూటీ పార్లర్లు, స్పాల ముసుగులో వ్యభిచారం చేస్తున్న వారిని గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో వీరు కొత్త ప్లాన్ వేశారు. ఎవరికి చిక్కకుండా దందా నిర్వహించాలని పథకం రచించారు. ఇందులో భాగంగా ఓ మహిళ ఏకంగా శ్మాశనంలో వ్యభిచార దందా నిర్వహిస్తోంది.
Hyderabad | ఎవరికి అనుమానం రాకుండా..
శ్మశాన వాటికలో వ్యభిచారం నిర్వహిస్తే ఎవరికి అనుమానం రాదని మాధవి అనే మహిళ భావించింది. ఇందులో భాగంగా బేగంపేట (Begumpet) పోలీస్స్టేషన్ పరిధిలోని శ్యామ్లాల్ బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిని ఆమె అడ్డాగా ఎంచుకుంది. యువతులను తీసుకొచి, విటులను అక్కడికే రప్పించి దందా సాగిస్తోంది. అయితే శ్మశాన వాటికలోని గదిలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు (Task Force Police) తనిఖీలు చేపట్టారు.
Hyderabad | యువతులను రప్పించి..
పోలీసులు దాడి చేసిన సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉన్నాడు. మారీ మాధవి అనే మహిళ ఇక్కడ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలితో పాటు యువతి, విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలు, యువతులు, విటులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాధవి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గతంలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, స్పాలలో సాగిన వ్యభిచారం తాజాగా శ్మశాన వాటికలకు విస్తరించడంతో నగరవాసులు షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తెలివికి హ్యాట్సాప్ అని కొందరు అంటుంటే.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.