అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. వినాయకుడి భక్తులపైకి దూసుకెళ్లి వారిని ఛిద్రం చేసి, రక్తపు ముద్దలుగా మార్చేసింది.
వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హసన్లో భక్తులు వినాయక నవరాత్రి ఉత్సవాలను Vinayaka Navratri festival ఘనంగా నిర్వహించుకున్నారు.
భక్తిశ్రద్ధలతో ఆదిదేవుడిని కొలిచారు. నిష్ఠతో పూజించారు. ఇక లంబోధురుడిని వేడుకగా నిమజ్జనానికి Nijamajjan తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Karnataka Fatal accident : మృత్యు శకటం..
ఊరేగింపుగా బయలు దేరారు. గణపతిని కొలుస్తూ సంబరంగా వెళ్తున్నారు. కాగా ఓ మృత్యు శకటం వీరిపైకి దూసుకొచ్చింది. ఓ కంటైనర్ భక్తులపైకి దూసుకొచ్చింది. భక్తుల devotees మీది నుంచి వెళ్లింది.
దీంతో కంటైనర్ కింద నలిగిపోయి 8 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.