అక్షరటుడే, నిజాంసాగర్: Paddy Center | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మహమ్మద్ నగర్ (Mohammed Nagar) మండల వ్యవసాయ శాఖ అధికారిణి నవ్య అన్నారు. గున్కుల్ సొసైటీ (Gunukul Society) ఆధ్వర్యంలో నర్వ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన తేమశాతం (Humidity) ఉంటేనే ధాన్యాన్ని తూకాలు వేస్తారని స్పష్టం చేశారు. ఆమె వెంట ఏఈవో మధు, రైతులు దుర్గా ప్రసాద్ బాలరాజ్, గణేష్, కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.