ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలో ఆందోళన

    Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలో ఆందోళన

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | జీపీ తరపున విధులు నిర్వహిస్తూ సిద్ధాపూర్​లో (Siddhapur) ట్రాక్టర్​ బోల్తా పడి మృతి చెందిన ఇద్దరికి పరిహారం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్​ చేశారు. బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రిలోని (Bodhan Government Hospital) పోస్టుమార్టం గది ఎదుట వారు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు.

    ఈ సందర్భంగా మృతుల బంధువులు,కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. జీపీ తరపున పనిచేస్తూ వారు అకాల మరణం చెందినందున ఒక్కొక్కరికి రూ. 50లక్షల చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్​ చేశారు. వర్షంలోనూ వారు ధర్నా కొనసాగించారు.

    సమాచారం అందుకున్న బోధన్​ తహశీల్దార్​ విఠల్ ​(Bodhan Tahsildar Vitthal), బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు (Bodhan Rural CI Vijay Babu) బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

    More like this

    Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్​లోకి వరద కొనసాగుతోంది. ఉమ్మడి...

    Minister Jupally | కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్.. ఆనాడు మీకు సిగ్గులేదా? అని సూటి ప్రశ్న

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Jupally | పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్...

    Yellareddy MLA | మదన్​మోహన్​ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా భాగేశ్

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) యూత్ ఫోర్స్ ఎల్లారెడ్డి...