అక్షరటుడే, ఎల్లారెడ్డి: Blood Bonation Camp | తలసేమియా వ్యాధితో (Thalassemia disease) బాధపడుతున్న చిన్నారుల కోసం ఈనెల 14న పట్టణంలో మెగా రక్తదాన శిబిరం (mega blood donation camp) నిర్వహిస్తున్నట్లు మైనారిటీ కమిటీ ప్రతినిధి షేక్ గయాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 15 రోజుల కొకసారి రక్తం అవసరం ఉంటుందన్నారు. ఈ వ్యాధి గల చిన్నారులు రాష్ట్రంలో 10వేల మందికి పైగా ఉన్నారని.. ఉమ్మడి జిల్లాలో 250మందికి పైగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ చిన్నారులను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకువచ్చి స్వచ్ఛందంగా రక్తదానం (blood donation) చేయాలని ఆయన కోరారు. రక్తదానం చేయాలనుకునేవారు 9440288473, 9989861432, 9440563755, 9951800737, 9441071251 నంబర్లను సంప్రదించాలని కోరారు.