అక్షరటుడే, వెబ్డెస్క్: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)ను భారత్ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం–1934 ఆధారంగా ఏప్రిల్ 1, 1935న ఆర్బీఐని స్థాపించారు. మొదట దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది. తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబయికి మార్చారు.
ప్రారంభంలో ప్రైవేటు అజమాయిషిలో ఉన్న ఆర్బీఐని 1949లో జాతీయం చేశారు. అప్పుడు కేంద్ర సర్కారు అధీనంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్బీఐకి 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉండటం గమనార్హం.
RBI land transaction | 4.61 ఎకరాలకు రూ. 3,472 కోట్ల చెల్లింపు..
ఇక అసలు విషయానికి వస్తే.. ఆర్బీఐ ముంబయి Mumbai లో అతిపెద్ద భూలావాదేవీ చేపట్టింది. 4.61 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.3,472 కోట్లు చెల్లించింది.
నారీమన్ పాయింట్లో ఉన్న ల్యాండ్ కోసం ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఈ మొత్తాన్ని చెల్లించడం గమనార్హం. ఈ భూమికి సమీపంలోనే సమీపంలోనే కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు, ముంబయి హైకోర్టు ఉన్నాయి.
ఆర్బీఐ చేపట్టిన తాజా లావాదేవీ ప్రకారం ఎకరానికి సుమారు రూ. 800 చెల్లించదన్న మాట. ఇక ఈ ల్యాండ్ స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు చెల్లించడం గమనార్హం. భారత్లో ఈ సంవత్సరం జరిగిన అతిపెద్ద భూమి లావాదేవీగా దీనిని పేర్కొంటున్నారు.