అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు బీఎస్ రెడ్డి (BN reddy) పేర్కొన్నారు. వెంబో డయాబెటిక్ కేర్ (Vembo Diabetic Care) పీఎంపీ అసోసియేషన్ (PMP Association) ఆధ్వర్యంలో బుధవారం సుభాష్ నగర్లో షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదిమందిలో ఆరుగురు షుగర్ వ్యాధిన పడుతున్నారని అన్నారు. తమను తాము అదుపులో ఉంచుకుంటూ వైద్యులు సూచించిన విధంగా ఆహారం తీసుకోవాలన్నారు. ఎక్కువ ఆకుకూరలు పచ్చివి లేక ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు తీసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి కంట్రోల్లో ఉంటుందన్నారు.
ఆకలి వేసినప్పుడల్లా కీర ముక్కలు, పల్చటి మజ్జిగ మధ్య మధ్యలో తీసుకోవాలన్నారు. ఉదయం సాయంత్రం వాకింగ్తో పాటు వ్యాయామం చేస్తే మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం మోహన్, నగర అధ్యక్షుడు సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొట్టు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.