ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ నాయకులు ఎల్లారెడ్డి పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్​లో పీఎం మోడీ(PM Modi) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

    అనంతరం బీజేపీ నాయకులు(BJP Leaders) మాట్లాడుతూ.. దేశంలో నిత్యావసర వస్తువులు, ఆటోమొబైల్​ రంగంలో వస్తువులపై గణనీయంగా జీఎస్టీ తగ్గించడం అనేది సామాన్యులకు ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు. ప్రతిఒక్క భారతీయుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ వీటిపై ఉన్న జీఎస్టీ(GST)ని పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు.

    నిత్యావసర వస్తువులపై12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గించారని.. ఆటోమొబైల్ రంగం(Automobile Sector)లో 28శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతం తగ్గించారని వివరించారు. పేద ప్రజలపై వివిధ టాక్స్​ల పేరుతో పట్టిపీడిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంలోని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను స్ఫూర్తిగా తీసుకుని నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, బత్తిని దేవేందర్, పట్టణ అధ్యక్షుడు అగల్ దివిటి, రాజేష్ మండల అధ్యక్షుడు పెద్దెడ్ల నర్సింలు, మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి శంకర్ ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, పులి రమేష్, కార్యదర్శి మామిడి రమేశ్​, కోశాధికారి గజానంద్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ యువ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు....

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రిలో చిన్నారికి అరుదైన చికిత్స

    అక్షరటుడే, ఇందూరు: Medicover Hospital | నిజామాబాద్​ నగరంలోని మెడికవర్​ ఆస్పత్రిలో మూడేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన చికిత్స...

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...