ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

    Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ట్రాన్స్​కో ఆపరేషన్స్​(Transco Operations) డీఈ ఎండీ ముక్తార్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థ(Electricity department) అభివృద్ధిలో భాగంగా కొత్తపల్లి సబ్​స్టేషన్​ కోటగిరి సెక్షన్, రుద్రూర్ (Rudrur) సబ్ డివిజన్లలో నూతన వీసీబీలను ఆయన ప్రారంభించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. గృహ వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే క్రమంలో నూతన వీసీపీలను ప్రారంభించామన్నారు. రూ.3 లక్షలతో ఈ పరికరాలను అమర్చామని ఆయన తెలిపారు. కొత్తపల్లి (Kothapally) గ్రామ వినియోగదారులకు, అగ్రికల్చర్​ ఫీడర్​కు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన వివరించారు.

    ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ ఐఏఎస్ వరుణ్ రెడ్డి(NPDCL Chairman IAS Varun Reddy) ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎండీ ముక్తార్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు సరైన సేవలందించడాన్ని బాధ్యతగా భావించాలని కోరారు.

    అలాగే రైతుల ఎక్కడ కూడా సొంతంగా విద్యుత్​ పనులు చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ రుద్రూర్ తోట రాజశేఖర్, కోటగిరి ఏఈ బుజ్జిబాబు, విద్యుత్ సిబ్బంది ప్రేమ్ దాస్, వెంకటేశం, రాజు గౌడ్, రవి వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    MS Dhoni | యాక్ట‌ర్‌గా మారిన క్రికెట‌ర్ ధోనీ.. వైర‌ల్‌గా మారిన ‘ది చేజ్’ టీజ‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MS Dhoni | క్రికెట్‌లో త‌న బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్...

    Red Sea | ఎర్ర సముద్రంలో తెగిన ఇంటర్నెట్ కేబుల్స్.. పాక్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Red Sea | ఎర్ర సముద్రంలో అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్థాన్‌ (Pakistan) సహా...

    Rajagopal Reddy | ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం.. మరోసారి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు...