ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ : నలుగురికి తీవ్ర గాయాలు

    Kamareddy | ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ : నలుగురికి తీవ్ర గాయాలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గణపతి నిమజ్జనం(Ganesha immersion) కోసం ట్రాలీ ట్రాక్టర్​ను (Trolley tractor) తీసుకెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ఘటన కామారెడ్డి జాతీయ రహదారిపై క్యాసంపల్లి (Kyasam Pally) శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

    పోలీసులు.. బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు (Domakonda) చెందిన యువకులు రామారెడ్డి నుంచి గణపతి ట్రాలీని తీసుకుని వెళ్తున్నారు. ట్రాక్టర్ ఇంజిన్​కు ఇరువైపులా నలుగురు యువకులు కూర్చున్నారు. ట్రాలీ బైపాస్ రోడ్డుపై క్యాసంపల్లి శివారులోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది.

    ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజిన్​పై కూర్చున్న నలుగురికి గాయాలయ్యాయి. దోమకొండకు చెందిన సాయికుమార్, శ్రీధర్​తో పాటు ట్రాక్టర్ నడుపుతున్న రాజయ్య గాయపడ్డారు. ఇందులో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ (Hyderabad) రిఫర్ చేశారు. మరొక యువకుడిని సైతం నిజామాబాద్ (Nizamabad)​కు రిఫర్ చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Silver Ring | బొటనవేలికి వెండి ఉంగరం ధరించారా.. లక్ష్మీదేవి వచ్చినట్టే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Silver Ring | ప్రతి ఒక్కరి జీవితంలో ఉంగరాలు ధరించడం ఒక సాధారణ ఆచారం. మనం...

    GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ప్రముఖ కార్లపై భారీగా తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ సంస్థల కార్ల ధరలు భారీగా...