ePaper
More
    Homeక్రైంHyderabad | డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

    Hyderabad | డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ కేంద్రంగా డ్రగ్స్​ తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి భారీగా డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

    హైదరాబాద్​ నగరంలోని చర్లపల్లి (Cherlapalli) పారిశ్రామిక వాడలో కొందరు నిషేధిత డ్రగ్స్​ తయారు చేస్తున్నారు. ఓ కెమికల్​ ఫ్యాక్టరీలో ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టిన పోలీసులు ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఇందులో రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.

    Hyderabad | దేశంలోనే పెద్ద నెట్​వర్క్

    పోలీసులు స్పెషల్ ఆపరేషన్​ చేపట్టి డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు. దేశంలోనే వీరిది పెద్ద డ్రగ్​ నెట్​వర్క్​గా భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వీటిని తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర (Maharashtra)లోని మీరా రోడ్ పోలీసులు డ్రగ్స్​ రాకెట్​ను ఛేదించారు. 32 వేల లీటర్ల లిక్విడ్​లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఆపరేషన్​లో మొత్తం 13 మందిని అరెస్ట్​ చేశారు.

    Hyderabad | రహస్య ఆపరేషన్​

    మహారాష్ట్ర పోలీసులు మొదట దాడులు చేపట్టి 200 గ్రాముల ఎండీ డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.25 లక్షలు. అనంతరం వారు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టడంతో భారీ డ్రగ్స్​ రాకెట్​ వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముఠాలోకి తమ గూఢచారులను పంపించారు. కొన్ని రోజుల పాటు స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టి డ్రగ్స్​ ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించారు. అనంతరం చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

    Hyderabad | 13 మంది అరెస్ట్​

    చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్స్​ పేరిట నకిలీ లైసెన్స్​తో నిందితులు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. కానీ లోపల మాత్రం పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్స్​ను మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యాక్టరీపై దాడి చేసి రసాయన పరికరాలు, డ్రగ్ ఉత్పత్తి యూనిట్లు, 32 వేల లీటర్ల ప్రికర్సర్ కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ విదేశీయుడు సహా 12 మందిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమాని, రసాయన శాస్త్ర నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తనాజీ పాఠేను కూడా అరెస్ట్​ చేశారు. వారి నుంచి 100 గ్రాముల ఎండీ, రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

    More like this

    Kamareddy Floods | వరదల ఎఫెక్ట్​.. మరో మృతదేహం లభ్యం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Floods | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర...

    Ganesh immersion | వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

    అక్షరటుడే, ఇందూరు: Ganesh immersion | వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna...

    Teachers Day | దేగాంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    అక్షరటుడే, ఆర్మూర్​: Teachers Day | మండలంలోని దేగాం ఉన్నత పాఠశాలలో (Degam High School) ఉపాధ్యాయ దినోత్సవాన్ని...