ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BJP Nizamabad | జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

    BJP Nizamabad | జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | ప్రధాని మోదీ (PM Modi) జీఎస్టీపై (GST) తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ (Nagolla Lakshminarayana) అన్నారు. ఖిల్లా రాం మందిర్ (Killa Ram Mandir) మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి  శుక్రవారం పాలాభిషేకం చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో మోదీ నిర్ణయాలు ఎంతో కీలకంగా మారాయని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు భారత్​ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.

    కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడూరు నాగరాజు, మాజీ కార్పొరేటర్ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు మఠం పవన్, చిరంజీవి, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు మారుతి, శక్తి కేంద్ర ఇన్​ఛార్జీలు, పార్టీ కార్యాలయం ఇన్​ఛార్జి బద్దంకిషన్, మీడియా సెల్ కన్వీనర్ వీరేందర్, వెంకటరాములు, కిరణ్ రాథోడ్, చంద్రకాంత్, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Bigg Boss 9 | గ్రాండ్‌గా బిగ్ బాస్ లాంచింగ్​.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss 9) ఎప్పుడెప్పుడు...

    Sriram Sagar Gates Lifted | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎనిమిది గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Gates Lifted : ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయంలోకి ఇన్​ఫ్లో...

    Amaravati Property Festival | అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ 2025.. మూడు రోజుల పాటు ప్ర‌త్యేక రాయితీలు

    అక్షరటుడే, అమరావతి: Amaravati Property Festival | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిబింబిస్తూ.. నేషనల్ రియల్ ఎస్టేట్...