ePaper
More
    HomeజాతీయంCentral Cabinet | కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయం.. మినరల్​ రీసైక్లింగ్​కు భారీగా నిధులు

    Central Cabinet | కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయం.. మినరల్​ రీసైక్లింగ్​కు భారీగా నిధులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Central Cabinet | కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్‌ను (critical mineral recycling) ప్రోత్సహించడానికి రూ.1,500 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్​ భేటీ అయింది. పలు ఖనిజాల వెలికితీత, బ్యాటరీ, ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించింది. ద్వితీయ వనరుల నుంచి కీలకమైన ఖనిజాలను వేరు చేయడం, ఉత్పత్తి చేయడం కోసం దేశంలో రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది.

    Central Cabinet | సామర్థ్యాన్ని పెంపొందించడానికి..

    నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్​లో (National Critical Mineral Mission) (NCMM) భాగంగా కీలకమైన ఖనిజాలలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించాలని కేంద్రం యోచిస్తోంది. ఖనిజాల అన్వేషణ, వేలం, గని నిర్వహణ కోసం నిధులు వినియోగించనుంది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అమలులో ఉంటుంది. అర్హత కలిగిన ఫీడ్‌స్టాక్ ఇ-వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ (LIB) స్క్రాప్​ రీసైక్లింగ్​ చేసి ఖనిజాలు వెలికి తీయడం దీని ఉద్దేశం. ఇప్పటికే ఉన్న రీ సైక్లింగ్​ యూనిట్లకు, కొత్తగా స్థాపించే వారికి ఈ పథకం కింద ప్రోత్సాహకం అందించనున్నారు.

    Central Cabinet | యూనిట్లకు సబ్సిడీ

    మినరల్​ రీ సైక్లింగ్​ పథకం (Mineral Recycling Scheme) కింద నిర్దిష్ట కాలపరిమితిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్లాంట్, యంత్రాలు, పరికరాలు అనుబంధ యుటిలిటీలపై 20శాతం సబ్సిడీని కేంద్రం అందించనుంది. ఈ పథకం అమలులోకి వస్తే ఏటా కనీసం 270 టన్నుల ఈ– వేస్ట్​ను రీసైక్లింగ్​ చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో 40 టన్నుల కీలకమైన ఖనిజ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొంది.

    More like this

    Artificial Intelligence | ఏఐని ట్రైన్ చేసి ఉద్యోగం కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని.. ఇప్పుడు ల‌బోదిబోమంటుంది.!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Artificial Intelligence | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ప్రతీ రంగంలో వేగంగా పెరుగుతోన్న...

    Madras High Court | భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం ఉంటే భరణం అవసరం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Madras High Court | భార్యభర్తల మధ్య విడాకుల కేసుల నేపథ్యంలో భరణం చెల్లింపు...

    H-160 Helicopter | భద్రత, వేగం లక్ష్యంగా చంద్రబాబు నాయుడుకు అత్యాధునిక హెచ్-160 హెలికాప్టర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: H-160 Helicopter | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మరియు పర్యటనల...